టాలీవుడ్ లో 90వ దశకంలో తన గ్లామర్ తో అప్పటి యువత హృదయాలను కొల్లగొట్టిన నటి రమ్యకృష్ణ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తల్లి, అత్త పాత్రల్లో నటిస్తుంది.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రమ్యకృష్ణ చాలా బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తుంది.  అప్పట్లో రజినీకాంత్ నటించిన నరసింహా సినిమాలో నీలాంభరి పాత్రల రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 లో శివగామి పాత్రలో రమ్యకృష్ణకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  ఈ మూవీతో ఆమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా దక్కింది. 

 

ప్రస్తుతం తెలుగు లో పలు సినిమాల్లో నటిస్తున్న రమ్యకృష్ణ ఆ మద్య పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సీక్వెల్ కేజీఎఫ్ 2 లో ఛాన్స్ వచ్చిందట.  ఈ మూవీ తో కన్నడ హీరో యష్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేజీఎఫ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ భారీ పెట్టుబడితో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఓ పవర్ ఫుల్ పాత్రలో నటింపజేసేందుకు రమ్యకృష్ణను సంప్రదించారట చిత్రయూనిట్.  అయితే భారీ పెట్టుబడితో వస్తున్న కారణంగా తన పారితోషికం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినట్లు సమాచారం.

 

దాంతో ఆమె స్థానంలో బాలీవుడ్ నటి రవీనా టండన్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ మూవీలో యష్ కి విలన్ గా సంజయ్ దత్ నటించడం పై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఇక యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్న గా  నటిస్తున్నట్లు సమాచారం.  అంతే కాదు ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో రావు రమేష్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే రెండవ భాగంపై భారీ అంచనాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: