తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు వివివినాయక్ మొదటి సారిగా హీరోగా ‘శీనయ్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  తన కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలకు ఠాకూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. బెల్లంకొండ శ్రీను, అఖిల్ లను ఈయనే ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా వివివినాయక్ 'దిల్' రాజు నిర్మాణంలో .. 'శరభ' ఫేమ్ నరసింహా దర్శకత్వంలో 'శీనయ్య'  ఓ చిత్రానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆ మద్య రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చినా.. దానికి సంబందించిన ఎలాంటి అప్ డేట్స్ మాత్రం తెరపైకి రావడం లేదు.

 

ఆ మద్య పాత్ర పరంగా కాస్త సన్నగా కనిపించడంకోసం గట్టిగానే కసరత్తులు చేశాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు వివివినాయక్.   ఎంతో మంది హీరోలను వెండి తెరపై డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించిన దర్శకుడు హీరోగా మారుతున్నారని తెలియగానే ఫ్యాన్స్ మంచి ఆనందంలో ఉన్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రంలో వివివినాయక్ ఆయన శిష్యుడి పాత్రలో కనిపించారు.  చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించబోతున్న ఈ దర్శకుడిని కొత్తగా చూడబోతున్నామని ప్రేక్షకులు భావించారు.  ఇటీవలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రషెస్ చూసిన తరువాత వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. 

 

ఈ చిత్రం అనుకుంటున్న స్థాయిలో బూస్టింగ్ లేదని ఆయన ఒకింత నిరాశకు లోనైనట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ విషయం నిర్మాత దిల్ రాజు దృష్టికి కూడా తిసుకురావడం.. ఆయన ఒకే అనడం జరిగిందట.   మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే మాట ఫిలిమ్ వర్గాల్లో వినిపిస్తుంది.. కానీ ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయలేదు..   సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు పుట్టుకు రావడం ఈ  మద్య కామన్ అయ్యిందని అంటున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: