రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉంది. వరుణ్తో ‘తొలిప్రేమ’ అనేసి.. రవితేజతో ‘టచ్ చేసి చూడ’మని.. ప్రేక్షకుల ‘ఊహలు గుసగుసలాడే’లా చేసిన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటుంది. అయితే తొలి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా తన అందం అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ బ్యూటీ. సుప్రీమ్, జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, జై లవకుశ వంటి హిట్ చిత్రాలతో బిజీ హీరోయిన్గా మారిన రాశీ ఖన్నా అటు తమిళంలో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది.
ఇక ఇటీవల సరైన హిట్స్ తన ఖాతాలో పడడంతో.. రాశి ఖన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ కథానాయికగా ప్రజల చేత శభాష్ అనిపించుకోగలిగింది. వెంకీ మామ చిత్రంలో రాశి పోషించింది కమర్షియల్ హీరోయిన్ పాత్రే అయినప్పటికీ.. ప్రతిరోజూ పండగే చిత్రంలో మాత్రం యాంజెల్ ఆర్న అలియాస్ టిక్ టాక్ సూపర్ స్టార్ పాత్రతో మంచి మార్కులే కొట్టేసింది. ఇదే జోష్ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమాలో సరసన నటించింది రాశీ. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ రొమాన్స్ చేశారు.
డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో బిజి అయింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ లో రాశి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు తన పర్సనల్ క్యారెక్టర్ తో కొంత సంబంధం ఉందని, దర్శకుడు క్రాంతి మాధవ్ ఎంతో బాగా తన పాత్రను రాశారని రాశి చెప్పింది. అయితే మీ లైఫ్ లో లవ్ అనేది ఉందా, ఎవరినైనా ప్రేమించారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాశి.. జీవితంలో ప్రేమ అనేది ఎంతో మధురమైనదని, అందరిలానే తనకు అటువంటి అనుభవాలున్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాక తన లైఫ్ లో రెండు సార్లు బ్రేకప్ లు జరిగినట్లు రాశి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది.