రాజకీయ రంగంలో మరియు సినిమారంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కి ఇటీవల తన వాయిస్ పేరిట లీకైన ఆడియో తన కెరియర్ మొత్తాన్ని కొంపముంచింది. వైసీపీ పార్టీలో కీలకంగా ఉంటూ  జగన్ పాదయాత్ర చేసిన సమయంలో జగన్ కి మద్దతు తెలుపుతూ అడుగులు వేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైసిపి పార్టీ గెలిచాక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్  చైర్మన్ పదవి దర్శించుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడటంతో ఆ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అవడంతో పృద్వి కెరియర్ కి భారీ దెబ్బ పడింది.

 

దీంతో ఆ టైంలో జగన్ చైర్మన్ పదవి నుండి 30 ఇయర్స్ పృథ్విని తప్పించడం జరిగింది. మరోపక్క ఇండస్ట్రీలో కూడా బ్రిడ్జి పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం జరిగాయి. ఇటువంటి తరుణంలో 30 ఇయర్స్ పృధ్విని టార్గెట్ చేస్తూ తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీ షో లు జబర్దస్త్ మరియు అదిరింది షో లో ఉన్న కంటెస్టెంట్ లు పృద్వి ఆడియో లో మాట్లాడిన  నిన్ను వాటేసుకోవాలని అనిపించింది కానీ కెవ్వుమని కేక వేస్తావు అని భయమేసింది అంటూ మాట్లాడిన పృద్వి డైలాగ్ తో స్కిట్లు చేయడం స్టార్ట్ చేశారు.

 

దీంతో పృథ్వి బతుకు టెలివిజన్ రంగంలో కూడా నవ్వులపాలు కావడంతో చాలామంది పృథ్వి కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లే రాజకీయంగానూ మరియు సినిమారంగం పరంగానూ కోలుకోలేని దెబ్బ తగిలి నట్లే అని కామెంట్ చేస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పృద్వి పై వస్తున్న skit సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తూ పరువు తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: