స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా అలవైకుంఠపురములో. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వచించాడు. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ ని సంపాదించడంతో పాటు వరుసగా సంక్రాంతి సెలవలు కావడంతో, మరింత బాగా కలెక్షన్ కూడా దక్కించుకుంది. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పలురకాల కమర్షియల్ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. 

 

ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటీవల సక్సెస్ మీట్ ని విశాఖపట్నంలో ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన మూవీ యూనిట్, ఆ తరువాత పలువురు సినిమా ప్రముఖులకు ప్రత్యేక విందు ఇవ్వడంతో పాటు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు, అలానే మీడియా వారికి ప్రత్యేకంగా విడిగా పార్టీలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పటికీ కూడా అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్ సాధిస్తున్న ఈ సినిమా అతి త్వరలో యాభై రోజులకు చేరువ కానుండడంతో, ఎంతో గ్రాండ్ లెవెల్లో మంచి డేట్ ఫిక్స్ చేసి యాభై రోజుల వేడుకను చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

 

మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని ఆరంభించిన బన్నీ, ఇంకా అలవైకుంఠపురములో సినిమాకు సంబందించి కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాని ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. కాగా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాకు సంబంధించి 50 రోజుల వేడుక లాస్ట్ వేడుక కావడంతో, దానిని ఎప్పటికీ గుర్తిండిపోయేలా విజయవాడలో నిర్వహించనున్నట్లు టాక్. అలానే దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుంది అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: