నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందించిన ప్రయోగాత్మకమైన సినిమా 'అ!'. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించాడు. కమర్షియల్ గా సక్సస్ అవనప్పటికి ఈ సినిమా నిర్మాతగా నానీకి.. దర్శకుడిగా ప్రశాంత్ కి మంచి పేరు తెచ్చింది. అంతేకాదు జాతీయ అవార్డులు దక్కించుకున్న గొప్ప చిత్రంగా మిగిలింది. ఫిలింఫేర్- ఐఫా- జీ అవార్డుల్ని గెలుచుకుని అన్ని వేదికలపైనా దర్శకనిర్మాతల పేరు నిలబెట్టిందంటే ఈ సినిమా కి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప సినిమాకి సీక్వెల్ విషయంలో డైలమా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

ఇపటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన సీక్వెల్ కొన్ని అనివార్యకారణాల వల్ల ఆలస్యమవుతోంది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ అ! సీక్వెల్ కథను రెడీ చేశారు. అయితే ప్రస్తుతం నిర్మాత కోసం ప్రయత్నాలలోఉండటం వల్లే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోందట. సీక్వెల్ ని నాని ఎందుకని నిర్మించడం లేదు? అంటే అందుకు షాకింగ్ రీజన్ తెలిసింది. అ! చిత్రీకరణలో ఉండగానే నిర్మాత నానీతో ప్రశాంత్ వర్మకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. సరైన సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడంలో ప్రశాంత్ ఫేయిలయ్యాడని .. చివరి నిమిషం వరకూ నాని టెన్షన్ కి గురయ్యాడని తెలుస్తోంది. ముందు నుంచి నానీకి దర్శకుడితో సెట్ కాలేదని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నానీ ఈ సీక్వెల్ ని వద్దనుకున్నాడట. దాంతో ప్రశాంత్ మరో నిర్మాతను వెతుక్కునే పనిలో ఉన్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

 

అ! సినిమాతో అవార్డ్ సినిమా దర్శకుడిగా పేరొచ్చినప్పటికి కమర్షియల్ గా రాబట్టింది మాత్రం ఏమీలేదు. ఆ తర్వాత తెరకెక్కించిన కల్కి సినిమా కూడా బాక్సాఫీస్ ఘోరంగా బోల్తాపడింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ కి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఫిలింమేకర్ గా ప్రశాంత్ స్కిల్ కి పరిశ్రమలో మాత్రం మంచి గుర్తింపు ఉందన్న విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఈ సీక్వెల్ కి నిర్మాత ఎప్పుడు సెట్ అవుతాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: