సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలంటే అవి ఆఖరివరకు ఉంటాయని గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతుంటారు కూడా చాలా మంది. ఒకప్పటి అందాల భామ.. ఇప్పుడు హుందా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది కుష్బూ సుందర్.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఒక మీడియా సంస్థకు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో తన భర్త సుందర్ చేసిన ప్రపోజల్ గురించిన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సుందర్ దర్శకత్వంలో తాను తొలి సినిమా తీస్తున్నప్పుడు.. తాను అప్పటికే పెద్ద హీరోయిన్ నని.. మేడం ఈ షాట్ ఉంది.. ఆ షాట్ ఉందంటూ చెప్పేవారన్నారు.
"ఒక రోజు మాట్లాడుతూ.. నీకు నాకు పిల్లలు పుడితే నీలా ఉంటారా? నాలా ఉంటారా? అని అడిగారు. ఒక్కసారిగా నేను షాక్ తిన్నా. ఎక్స్ క్యూజ్ మి.. మీరేం అడుగుతున్నారు? నాకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారా? అని అడిగా. అప్పుడు తను ఓ.. అదంతా చేయాలా? నాకు తెలీదు.. సరే.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. అప్పటికి అతను తన మొదటి సినిమా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ 20 రోజులకే ప్రపోజ్ చేశాడు. అతని నిజాయితీ నచ్చింది. దాంతో నేను అతనికి వెంటనే ఓకే చెప్పేశాను. అంతేకాక ఆయనను అంతగా ఇష్టపడటానికి మరో కారణం ఏమిటంటే... అతను లవ్ గురించి మాట్లాడలేదు.. ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. అది నచ్చింది నాకు. అంటూ తనకు చేసిన ప్రపోజ్ గురించి వెల్లడించారు.
తన భర్త తనకు చేసిన మొదటి ప్రపోజ్ గురించి చెప్పిన కుష్బూ.. మరో ఆసక్తికర అంశాన్ని చెప్పారు. తనకి ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పటికి తనకు ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయన్నారు. అలా వచ్చినప్పుడు మా ఆయన్ని అడిగి చెబుతానని అంటుంటాని నవ్వేశారు. తమకు ఇద్దరు పిల్లలని.. పెద్ద పాప తనలా ఉంటుందని.. చిన్నపాప మాత్రం అచ్చం వాళ్ల నాన్న జిరాక్స్ లా ఉంటుందన్నారు. ప్రస్తుతం కుష్బూ అప్పుడప్పుడు హీరోలకు అక్క పాత్రల్లో నటిస్తూ కనిపిస్తున్నారు.