టాలీవుడ్ లో సమంత కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పెళ్ళికి ముందు ఎంగ గ్లామర్ గా నటించిందో ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అంత డీసెంట్ గా క్యారెక్టర్స్ ని సెలక్ట్ చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటుంది. అయితే చైతూ తో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ ఇదే తన లాస్ట్ సినిమా అంటూ ప్రతీ సినిమాకి ప్రచారం జరుగుతోంది. ఇక మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కావాలనే నెటిజన్స్ ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను పట్టించుకోకుండా చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత వరుసగా సినిమాలు చేస్తూ ఆ పుకార్లకు సమాధానం చెబుతూ వచ్చింది. తాజాగా జాను సినిమాతో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత నటన పరంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే జాను సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ రెండు మూడు సంవత్సరాల తర్వాత సినిమాలు చేయనంటూ క్లారిటి ఇచ్చిందంటు సోషల్ మీడియాలో తెగ రాసేస్తున్నారు.

 

సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత ఫ్యాన్స్, అక్కినెని ఫ్యాన్స్ హర్ట్ అయి సినిమాలు మానొద్దంటూ సలహాలిస్తున్నారు. సమంత నటిస్తూనే ఉండాలంటూ ఫ్యాన్ కోరుతున్నారు. తన గురించి మీడియాలో ఇంతగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత స్వయంగా స్పందించింది. నా మాటలను అపార్థం చేసుకున్నారని ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని, కాని నేను ఇంత కాలం హీరోయిన్ గా చేస్తుండటం సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తపరచింది.

 

నేను మద్యలో గ్యాప్ తీసుకున్న మళ్లీ సినిమాలు చేస్తాను. ఒక వేళ హీరోయిన్ గా ఆఫర్లు రాకపోయినా ఏదో ఒక రకంగా సినిమాల్లో కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే సమంత మాటలను బట్టి చూస్తే తను హీరోయిన్ గా ఛాన్సెస్ రాకపోయిన కూడా మంచి క్యారెక్టర్స్ లో అభిమానులని అలరిస్తుంటుందని చాలా క్లియర్ గా తెలిపింది. అమేకాదు సోషల్ మీడియాలో కొన్ని పిచ్చిరాతలు రాసే వారికి తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి సమంత సమాధానం సున్నితంగా చెంప పగలకొట్టినట్టు ఇచ్చింది. ఇలా ప్రతీ హీరోయిన్ మీద వస్తున్న గాసిప్స్ కి వాళ్ళు కూడా ఇలా రియాక్ట్ అయితే అందరు నోరు మూసుకుంటారని సమంత ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: