పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు విలాసాలకు దూరంగా ఉంటాడు అన్న ప్రచారం ఉంది. దీనితో పవన్ కు వేల కోట్లలో ఆస్థులు లేవు అని ఆయన సన్నిహితులు అభిప్రాయపడతారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మీడియాలో హడావిడి చేస్తున్న ఒక వార్త విని పవన్ వీరాభిమానులు కూడ షాక్ అవ్వడమే కాకుండా పవన్ కు కూడ ఆస్థుల పెంపకం పై మోజు ఏర్పడిందా అంటూ ఆశ్చర్య పడుతున్నట్లు టాక్. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్యనే పూనా నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్న అకిరా నందన్ ఆద్య లకు భాగ్యనగరంలో పవన్ సుమారు 5 కోట్లు విలువ చేసే ఒక ఖరీదైన అపార్ట్మెంట్ ను కొన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. సినిమాకు 40 కోట్లకు పైగా పారితోషికం తీసుకుని పవన్ కళ్యాణ్ కు 5 కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్ కొనడం పెద్ద విషయం కాకపోయినా తనకు ఆస్థుల పై మోజు లేదు అంటూ తరుచు చెప్పే పవన్ కళ్యాణ్ ఇలా ఇప్పుడు అకిరా ఆద్య లకు ఒక విలువైన ఆస్థి కొనడం షాకింగ్ న్యూస్ గా మారింది.


హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం పవన్ జయభేరి నిర్మాణ సంస్థ అవుటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో నిర్మించిన ఈ ఖరీదైన అపార్ట్మెంట్ ను తన పిల్లల కోసం కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారి పవన్ అభిమానుల మధ్య ట్రెండింగ్ గా మారింది. 


హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన పేరున్న విద్యా సంస్థలో పవన్ పిల్లలు చదువుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కు సరిసమానంగా పొడవు ఎదిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అకిరా ను అతడి డిగ్రీ చదువు పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక మేరకు అకిరా మూవీ ఎంట్రీని గ్రాండ్ గా చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: