టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  అన్న చిరంజీవి బాటలో నడుస్తూ మాస్ ఫాలోయింగ్ సంపాదించారు పవన్ కళ్యాన్.  ఆయన నటించిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది.  గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాన్ మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయికి చేరుకుందంటే.. ఏకంగా ఆయన ఓ పార్టీనే పెట్టి ప్రజల్లోకి వెళ్లేలా... గతంలో తన సోదరుడు చిరంజీవి సైతం ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.  మొదటి నుంచి ప్రజలు.. వారి సమస్యలపై పోరాడాలి అనే మనస్థత్వం ఉన్న పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించి గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు.  కానీ ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయినా ప్రజల్లో తన పార్టీ బలోపేతం కోసం పాట్లు పడుతూనే ఉన్నారు. 

 

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా  ఫ్లాప్ తర్వాత ఎన్నికల్లోకి వెళ్లడం.. పోటీ చేయడం అంతా అయిపోయింది.  ఇప్పుడు మళ్లీ పవన్ ముఖానికి రంగు వేసుకుంటున్నారు.  ఈ క్రమంలో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రిమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. అయితే పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీస్‌  సంస్థ ఈ మూవీ నిర్మించనున్నది.  ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన శృతిహాసన్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.

 

గతంలో ‘గబ్బర్‌సింగ్‌', ‘కాటమరాయుడు’ మూవీల్లో పవన్‌కల్యాణ్‌, శృతిహాసన్‌ జోడీ తమ కెమిస్ట్రీతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.   ముచ్చటగా మూడోసారి ఈ జంట వెండితెరపై సందడిచేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ అమ్మడు చాలా గ్యాప్ తీసుకొని రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీలో నటిస్తుంది. మరి ఈ రెండు సినిమాలు శృతిహాసన్ కి మంచి మైలేజ్ ఇస్తాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: