టాలీవుడ్ లో ఎంతోమంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటింది. తమిళ ఈలం నేత వేళు పిళ్లై ప్రభాకరన్కు సంబంధించిన యాదార్థ సంఘటనల ఆధారంగా మంచు మనోజ్ చేసిన చిత్రం `ఒక్కడు మిగిలాడు`. కానీ ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ అయ్యింది. దాంతో మానసికంగా కొంత వైరాగ్యానికి లోనైన మంచు మనోజ్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఈలోగా ఆయన వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడంతో సినిమాలపై దృష్టి సారించలేక పోయారు. అయితే మరో వారం రోజుల్లో కొత్త అప్డేట్ ఇస్తానని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తించింది.
అన్నట్లుగానే వారానికి మించి టైమ్ తీసుకున్నా మంచు మనోజ్ బ్రేకింగ్ న్యూస్తో వచ్చాడు. గురువారం ఆయన నటిస్తున్న తాజా మూవీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని సోషల్ మీడియా ట్విట్ చేశాడు. ఈ టైటిల్ ఫస్ట్లుక్తో పాటు ఓ ఎమోషనల్ పోస్ట్ని కూడా మరోజ్ షేర్ చేశారు. `3 సంవత్సరాల తరువాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా సమయంలో ఏ భావోద్వేగంతో ఉన్నానో అదే భావోద్వేగంతో వున్నాను. ఈ మూడేళ్ల కాలంలో నాతో సహకరించిన వారందరికి ధన్యవాదాలు. నా జీవితాన్ని. నా కళను కోల్పోయాను.
సినిమా అమ్మా వచ్చేశా`అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో 'అహం బ్రహ్మాస్మి' చేస్తున్నాడు. తాజాగా టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదులుతూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించాడు. శ్రీకాంత్ రెడ్డిని దర్శకుడిగా తీసుకున్న ఆయన, మార్చి 6వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు ఆ రోజున తెలియనున్నాయి.
Coming forward to u guys after 3 years. Feel the same emotion as I felt for my first movie DD. Thanks for all ur love and support on and off-screen throughout this journey. I missed my Art which is my life. CineAmma, Vachesaaaa😎🙏🏻❤
— MM*🙏🏻❤️ (@HeroManoj1) February 13, 2020
Love you all Darlings❤🙏🏻. #AhamBrahmasmi #AB pic.twitter.com/VYevifoMBT