దర్శకుడు రాజమౌళి తెరకక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం rrr సినిమాలో రామ్ చరణ్ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.1920 నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో జరిగిన కథ ఇది. యుక్త వయసులో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు ఒకేలా కొన్నాళ్ళు అజ్ఞాత వాసం చేసారు. ఆ సమయంలో ఇద్దరు ఒకేదగ్గర కలిసి ఉంటె అనే సరికొత్త ఆలోచనతో జక్కన్న నిర్మిస్తున్నాడు. దీంతో రాజమౌళి చిత్రీకరించే.. ఈ సినిమా కోసం యావత్ దేశమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

 

 

ఇప్పటికే అటు ట్రేడ్ వర్గాలలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఈ సినిమా పెంచేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లకు సంబందించిన ఓ ఆసక్తి కరమైన కథతో ఈ సినిమా ఉంటుందని జక్కన చెప్పాడు. ఇద్దరు వీరులు యుక్త వయసులో అజ్ఞాతంలోకి వెళ్లి.. ఇద్దరు ఒకేసారి బయటికి వచ్చి … అడవి బిడ్డల్లో పోరాట పటిమ నేర్పించి.. వాళ్ళకోసం పోరాడి చివరకు వీరులుగానే అమరులు అయ్యారు. దాదాపుగా చుస్తే ఇద్దరిది దాదాపుగా ఒకే కథ. కాకపోతే ఒకరిది తెలంగాణ, ఇంకొకరిది ఆంధ్ర ప్రదేశ్..

 

 

అయితే ఈ ఇసినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే .. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేమిటి .. ఇద్దరు హీరోలు బావా.. బావా అనుకుంటూ మంచి స్నేహ బంధంతో ఉంటారు అలాంటి వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయా అన్న ఆసక్తి ఎదురైంది. ఇద్దరు హీరోల ఫాన్స్ మధ్య టెన్షన్ మొదలైంది.

 

 

కానీ... అలాంటివి ఏమీ వీరిద్దరి మధ్య విబేధాలు లేవట. కేవలం రీల్ లైఫ్ లో అల్లూరికి కొమరం భీం కు మధ్య విభేదాలు తలెత్తే సీన్ ఉంటుందని, వారిద్దరూ ఒకరికిని ఒకరు కొట్టుకునేవరకు అది వెళుతుందని .. ప్రస్తుతం ఆ సీన్స్ చిత్రీకరిస్తున్నారట.. ఫ్యాన్స్ ఇక విషయం తెలిసింది కదా.. మనస్పర్ధలు పెట్టుకోకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: