టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో తిరిగి వెండి తెరపై కనిపించారు.   ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దాంతో ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు.  ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా... రామ్ చరణ్ నిర్మించారు.  అయితే ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొల్పింది. కానీ తీరా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారట. 

 

ఈ నేపథ్యంలో వరుస హిట్స్ తో దూసుకు పోతున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీ దేవాలయాల మాఫియా పై పోరాడే ఓ వ్యక్తి స్టోరీ అంటున్నారు. అంతే కాదు మూవీకి ఆచార్య అనే టైటిల్ కూడా ఫిక్స్ అవుతున్నట్లు టాలీవుడ్ సమాచారం.  అయితే ఈ మూవీ  వినోదంతో పాటు సందేశంతో కూడిన కథ ఇది.  అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవీతో పాటు ఓ కీలక పాత్రలో విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 

అంతే కాదు మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై సినిమా యూనిట్ సభ్యులు స్పందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు.  అయితే ఈ మూవీలో మోహన్ బాబు కి తగ్గ స్థాయిలో పాత్ర లేకపోవడం వల్లనే ఆయనను సంప్రదించలేదని చిత్ర యూనిట్ చెబుతున్నారట.  గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ .. నిరాశే అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: