టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా టాలీవుడ్ కి ముందుగా బాలనటులుగా పరిచయం అయి, ఆతరువాత పెరిగి పెద్దయ్యాక హీరోలుగా మారి, పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ లు అందుకుని హీరోలుగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుని తమ ఫ్యామిలీలతో హ్యాపీగా గడుపుతున్న ఈ ఇద్దరు స్టార్స్ కూడా మొదట్లో కొంత రిజర్వుడు గా ఉండేవారు, మహేష్ అయితే మరింతగా సిగ్గుతో కెరీర్ మొదట్లో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 

 

అయితే రాను రాను సినిమానుభవం ఆయనలో ఎంతో మార్పు తెచ్చిందని, ఆ తరువాత నుండి ఎక్కువగా ఫ్యాన్స్ ని మీడియాని కలవడం మొదలెట్టానని మహేష్ చెప్తుంటారు. ఇక ఎన్టీఆర్ కూడా వీలైనపుడు తన లైఫ్ స్టైల్ విషయాలను మీడియా వారికి ఇంటర్వ్యూ ల రూపంలో పంచుకుంటుంటారు. ఇక ఈ విశ్వంలో ఎంతో గొప్పదైన ప్రేమ గురించి ఈ ఇద్దరు హీరోలు కూడా కొన్నేళ్ల క్రితం విడి విడిగా ఇచ్చిన ఇంటర్వ్యూ లను గమనిస్తే, మనకు వారిద్దరి విషయంలో ఒక్క సారూప్యత మాత్రం కనిపిస్తుంది. అదేమిటంటే, ఈ ఇద్దరూ కూడా దివంగత అతిలోక సుందరి శ్రీదేవికి వీరాభిమానులు కావడం. 

 

తనకు శ్రీదేవిని మించిన అందగత్తె ఎప్పుడూ ఎక్కడా ఇంతవరకు కనపడలేదని, అలానే మొదట ఆమెను తెరపై చూసినపుడు నిజంగా అతిలోక సుందరి అనే భావన తన మనసులో కలిగిందని ఎన్టీఆర్ అంటే, తన ఎంటైర్ కెరీర్ లో తనకు శ్రీదేవి అంటే అమితమైన ఇష్టం అని, నాన్నగారితో ఆవిడ చాలా సినిమాలు చేసారు, నిజంగా ఆవిడ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే, అటువంటి వారు సినిమా ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇక ఒకరకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు బడా స్టార్స్ ఇద్దరూ కూడా శ్రీదేవి అందం, అభినయానికి ముగ్ధులైన వ్యక్తులు అని అర్ధం అవుతుంది. శ్రీదేవి అందానికి ముగ్ధులైన ఈ ఇద్దరు హీరోలు ఒకరంగా ఆమె అందానికి దాసులయ్యారు అని చెప్పవచ్చు.... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: