పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్ లో తన 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.  తాజాగా మరోసారి పూర్తి స్క్రిప్ట్ విన్న పవన్.. సినిమా కు ఓకే చెప్పాడట. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కలుపకుండానే ఈ సినిమా బడ్జెట్ 100కోట్ల వరకు వెళుతుందట. దాంతో నిర్మాత ఏఎం రత్నం, పవన్ ను పారితోషికం బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని కోరాడట దానికి పవన్ కూడా అంగీకరించాడని సమాచారం.
 
ఇక ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ను పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీలైనంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసి ఈఏడాది చివర్లో ఈచిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా  విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీలు దిశా పటాని , జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లను హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం పవన్ ,పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సోషల్ మెసేజ్ తో రానున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు దాంతో ఈ సినిమా కు వకీల్ సాబ్ అనే టైటిల్ ను పెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మే లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ రెండు సినిమాల తరువాత పవన్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: