తెలుగు ఇండస్ట్రీలోకి ఊహలు గుస గుసలాడే చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాగశౌర్య ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల ‘అశ్వథ్థామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు మరో చిత్రం పట్టాలెక్కించారు. నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభంచారు. 'లక్ష్మీ సౌజన్య' ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక 'రీతువర్మ' జంటగా రూపొందిస్తున్న చిత్రమిది.
ఫిల్మ్ నగర్లోని సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో ఉదయం 10.08 నిమిషాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.నవీన్ నూలి ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈనెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించి ఇతర నటీనటలు, సాంకేతిక వర్గం వివరాలు మరికొద్ది రోజులలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు.
ఈ చిత్రం కుటుంబ నేపథ్యంలో రూపొందుతుందని.. గతంలో నాగశౌర్య నటించిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో మరో మంచి కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులకు అందించబోతున్నామని అన్నారు. ఆ మద్య నాగశౌర్య తన సొంత బ్యానర్ లో నర్తనశాల తెరకెక్కించారు.. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇటీవల ఆడవారిపై అన్యాయాన్ని ఎదిరించే ఓ యువకుడి కథాంశంతో ‘అశ్వథ్థామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంమిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంపై నాగశౌర్య, రితూ వర్మలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ చిత్రం ఈ జంటకు ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.