ఒక సినిమా హిట్ కావాలంటే నటులు, స్క్రీన్ ప్లే, దర్శకుడి పనితీరు, కెమెరా వర్క్ మాత్రమే కాదు.. మ్యూజిక్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సినిమాలు నామ మాత్రంగా హిట్ అయినా.. మ్యూజిక్ పరంగా మంచి రికార్డులు నెలకొల్పిన చరిత్రలు ఉన్నాయి.  ఒక సినిమాకు సంగీతం ఎంత ముఖ్యమో గత సినిమాల చరిత్ర చూస్తే తెలుస్తుంది.  ఈ మద్య త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి విషయం తెలిసిందే.  

 

మూవీ నుంచి సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్ 160 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. అలాగే జియో సావన్ లో కూడా రీసెంట్ గా ఈ సాంగ్ 100 మిలియన్ ప్లేస్ ను క్రాస్ చేసింది. ఇంతటి లెజండరీ హిట్ అయిన సాంగ్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి అందరినోట ఈ పాటలే.. ఎక్కడి ఫంక్షన్లో అయినా ఈ పాటల సందడే.. ఇక ఎంతో మంది ఈ సాంగ్స్ పై రక రకాలుగా టిక్ టాక్ లు చేసిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా సామజవరగమనా ఈ సాంగ్ కి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనుకరిస్తున్నారు.  

 

ఇంత మంచి సాంగ్ అందించిన థమన్, సిద్ శ్రీరామ్ మరోసారి కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్ కు తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో ఒక మెలోడీ కోసం సిద్ శ్రీరామ్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి మరోసారి ఈ కాంబో ఎటువంటి మ్యాజిక్ చేస్తుందనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: