ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటే ఎవరైనా నోరెళ్ళబెడతారు. పూరి జగన్నాథ్ చిత్ర దర్శకుడు కాకముందు దూరదర్శన్ లో ఒక ధారావాహికకి దర్శకత్వం చేసేందుకు హైదరాబాదుకి వచ్చాడు. ఇందులోని భాగంగానే రెండు రోజుల షూటింగ్ చేయడం కోసం పూరి జగన్నాథ్ రామంతపూర్ వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ఓ ఇంటి ప్రాంగణంలో ఆ ధారావాహిక యొక్క షూటింగ్ నిర్వహిస్తుండగా... తొలిసారిగా పూరి జగన్నాథ్ లావణ్యని చూశాడు. చూసిన తక్షణమే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.


అక్కడే ఉన్న ఒక అమ్మాయిని పిలిచి 'ఆ మేడం వద్దకు వెళ్లి నా విజిటింగ్ కార్డు ఇవ్వు, అలానే ఆ మేడం అంటే నాకు బాగా ఇష్టం అని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పు. ఇష్టమైతే విజిటింగ్ కార్డులోని ఫోనుకి కాల్ చేయమను', అని చెప్పాడు. కానీ లావణ్య ఈ మాటలను విన్న తర్వాత భయపడిపోయి.. విజిటింగ్ కార్డును తిరిగి పంపించింది. అయినా మళ్లీ మళ్లీ పూరి జగన్నాథ్ తన విజిటింగ్ కార్డు ఆమెకు పంపించడం చేశాడట. దీంతో వారం రోజుల తర్వాత లావణ్య పూరి జగన్నాథ్ ఇచ్చిన విస్టింగ్ కార్డు నెంబర్ కి ఫోన్ చేసిందట. అయితే ఆ ఫోను నెంబరు పూరి అద్దెకుంటున్న ఇంటి ఓనర్ దట. దీంతో ఆమె షాక్ అవ్వడం ఆపై పూరి జగన్నాథ్ ఫోన్ చేయడం చకచకా జరిగిపోయాయి.


ఆ తర్వాత మెల్ల మెల్లగా వీళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతూ స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లికి దారితీసింది. ఎట్టకేలకు వారు తమ స్నేహితుల సహాయంతో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ప్రేమ కొనసాగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను తన దర్శకత్వం వహించిన సినిమాలలో పూరి జగన్నాథ్ చూపించాడని చాలామంది చెబుతారు. ఏ రామాయణ ఏదేమైనా తన సినిమాల్లోనే కాకుండా జీవితంలో కూడా పూరి చాలా బాగా గట్స్ ఉన్నాయని వారి లవ్ స్టోరీ వింటే ఎవరికైనా అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: