బాలివుడ్ సినిమాలు అనగానే చాలా మందికి ఉండే అభిప్రాయం భారీ వసూళ్లు వస్తాయని. టాలివుడ్, కోలివుడ్ కి అంటే స్థానికంగానే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, దానికి తోడు ఫాన్స్ కూడా సొంత రాష్ట్రాలకే పరిమితం అయి ఉంటారు. కాని బాలివుడ్ సినిమాలకు అలా కాదు కదా...? భాష అర్ధం కాకపోయినా హీరోయిన్ అందం కోసం అయినా అన్ని భాషల్లో కూడా హింది సినిమాలను ఆదరించే పరిస్థితి ఉంటుంది. అందుకే బాలివుడ్ నిర్మాతలకు నష్టాలు తక్కువ. గతంలో ఏమో గాని ఇప్పుడు మాత్రం నష్టాలు చాలా తక్కువ గానే ఉన్నాయి. 

 

అయితే ఒక సినిమా మాత్రం నిర్మాతను నిండా ముంచేసింది తాజాగా. అదే మలంగ్ సినిమా. ఈ సినిమాలో ఆదిత్యా రాయ్ కపూర్ హీరోగా, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన దిశా పటాని హీరో హీరోయిన్లు. "మలంగ్‌: అన్‌లిష్‌ ద మ్యాడ్‌నెస్‌" అనే టైటిల్ తో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఆషికి 2, ఏక్‌ విలన్‌ లాంటి హిట్స్ తో బాలివుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ మోహిత్ సూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మాత్రం హిట్ టాక్ నే తీసుకొచ్చింది. నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. 

 

రోమాన్స్, యాక్షన్ విషయంలో హీరో, హీరోయిన్లు చెలరేగిపోయారు. స్క్రీన్ ని ఈ ఇద్దరు డామినేట్ చేసారు. అయితే సినిమా మాత్రం వసూళ్లు సాధించలేదని అంటున్నారు. విడుదలైన తొలి వారం మంచి వసూళ్లు సాధించింది తొలి రోజు 7 కోట్లు, తర్వాత 8 కోట్లు, 10 కోట్లు వసూళ్లు చేసి దూసుకెళ్లింది. మరి ఏమైందో ఏమో గాని గత నాలుగు రోజులుగా సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయి. వీకెండ్ లో కూడా వసూళ్లు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 37 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బడ్జెట్ మాత్రం భారీగా అయిందని, వసూళ్లు ఇంకా రాకపోతే మాత్రం నిర్మాత నిండా మునిగిపోవడం ఖాయమని అంటున్నాయి బాలివుడ్ వర్గాలు. ఈ వీకెండ్ రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: