నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసిన చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి హిట్ కొట్టింది. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి అంతా సిద్దం చేసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా సుకుమార్ పూర్తి చేసాడు. అల వైకుంఠపురములో సినిమా ద్వారా అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను వసూళ్ళ పరంగా నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

 

కథ బాగుండటం, సంక్రాంతికి విడుదల అవ్వడం, త్రివిక్రమ్ దర్శకత్వం కావడం అన్నీ కూడా బన్నీకి ఆ విధంగా కలిసి వచ్చేసాయనే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ కూడా బన్నీకి కాస్త ప్లస్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ ని జాతీయ స్థాయిలో కూడా చేస్తున్నాడు. ఇందుకోసం ఒక జాతీయ ఛానల్ సహకారం కూడా బన్నీ తీసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన పారితోషకం విషయంలో బన్నీ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. తనకు పట్టింపులు అంటూ ఏమీ ఉండవు అంటూ కాస్త పెద్ద మనసుతో వ్యాఖ్యలు చేసాడు. 

 

ఈ సందర్భంగా తన తండ్రిని కూడా బన్నీ ప్రస్తావించాడు. అల వైకుంఠపురములో చిత్రానికి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ వచ్చిందట. అయితే తన తండ్రితో ఎప్పుడూ కూడా పారితోషక౦ గురించి తాను అసలు డైరెక్ట్ గా మాట్లాడలేదని, మాట్లాడను అని స్పష్టం చేసాడు. ఈ విషయంలో మామధ్య  ఓ మీడియేటర్ ఉన్నాడని ఒక నిర్మాత పేరు చెప్పాడు. ఆయనే బన్నీ వాస్ అన్నాడు. తన పారితోషికం విషయంలో బన్నీ వాస్ కఠినంగా ఉంటాడని, అరవింద్‌గారితో అయినా చాలా బేరాలు ఆడతాడని, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో అల్లు అర్జున్ ఈ విషయాలు మీడియాకు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: