యంగ్ హీరో నాగశౌర్య ,ఛలో తరువాత హీరోగా నిలదొక్కుకుంటాడునుకుంటే వరస పరాజయాలతో అతని కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇక కొద్దీ రోజుల క్రితం 'అశ్వథ్థామ'తో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈహీరో.. అయినా కూడా లాభం లేకపోయింది.పెద్దగా నష్టాలను తీసుకురాలేదు కానీ శౌర్య కు కావాల్సిన విజయాన్నిమాత్రం ఇవ్వలేకపోయింది. నూతన దర్శకుడు రమణ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించినా నాగశౌర్య నే అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. కథ కూడా ఆయనే అందించగా సినిమాను తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మించాడు. సినిమా పబ్లిసిటీ కోసం కూడా బాగానే కష్టపడ్డాడు ఇంత చేసినా కూడా శౌర్య కు ప్రతిఫలం మాత్రం దక్కలేదు.   
 
ఇదిలావుంటే నాగశౌర్య నటించనున్న కొత్త చిత్రం ఈ రోజు లాంచ్ అయ్యింది. లక్ష్మి సౌజన్య ఈచిత్రం తో దర్శకురాలిగా ప్రారంభం అవుతుండగా పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. ఈనెల 19నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా సినిమాను మేలో విడుదలచేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్నినిర్మించనుంది. మరి ఈ సినిమాతో నైనా నాగశౌర్య హిట్ కొడతాడో లేదో చూడాలి. 
 
ఈసినిమాతో పాటు శౌర్య మరో సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో నటించడానికి నాగశౌర్య ఓకే చెప్పాడు. ఇటీవలే ఈ సినిమా లాంచ్ అయ్యింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏషియన్ సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు  సంయుక్తంగా  ఈచిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే  ఈ సినిమా  గురించి మరిన్ని  వివరాలు  వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: