1984లో బాలీవుడ్ లో వచ్చిన అబోధ్ అనే సినిమా ద్వారా సినిమా రంగానికి నటిగా పరిచయం అయింది మాధురి దీక్షిత్. ఆ తరువాత ఆవారా బాప్, స్వాతి, హిఫజాత్, తేజాబ్ తదితర సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న మాధురి, అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుని అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. దివంగత దిగ్గజ నటి శ్రీదేవికి బాలీవుడ్ లో గట్టిపోటీ ఇచ్చిన మాధురి, అప్పట్లో సల్మాన్ ఖాన్ తో నటించిన హం ఆప్ హై కౌన్ అనే సినిమా ఎంతో అత్యద్భుతమైన విజయాన్ని అందుకుని అప్పటి యువత లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది. 

 

ఇక తన వివాహ అనంతరం మెల్లగా కొంత సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేయడం మొదలెట్టిన మాధురి, 2007 తరువాత దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు బ్రేక్ తీసుకుని తన లైఫ్ ని కుటుంబానికి కేటాయించారు. ఆపై 2013లో మళ్ళి సినిమాల్లోకి బొంబాయి టాకీస్ అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాధురి, అక్కడి నుండి మళ్ళి అవకాశాలతో ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల గత ఏడాది కలాంక్, టోటల్ ఢమాల్, 15 ఆగష్టు తదితర సినిమాల్లో నటించిన మాధురికి వయసు ఎంత పెరిగినప్పటికీ అందం మాత్రం కొంతవరకు తగ్గలేదనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు ఆ అందం వల్లనే ఆమె ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయలేనని, తాను మంచి గ్లామర్ ఓరియెంటెడ్ పాత్రలు ఉంటెనే నటిస్తానని, లేదంటే లేదని పలు ఆంక్షలు పెడుతూ, ఇటీవల కొన్ని అవకాశాలు కూడా వదులుకున్నట్లు కొన్ని బాలీవుడ్ వర్గాల టాక్. దానితో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదని అంటున్నారు. అయితే ఆంటీ ఏజ్ వచ్చినప్పటికీ కూడా హాటీ అందాలతో కూడిన పాత్రలు కావాలంటే ఎలా మాధురి అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: