నందమూరి అన్నదమ్ములు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం కలిసి ఓ సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి మల్టీస్టారర్ తీస్తున్నారా ఏంటని మీరనుకోవచ్చు. దానికి ఇంకాస్త టైం ఉంది కాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రాం నిర్మాతగా తారక్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న త్రివిక్రం సినిమాను కళ్యాణ్ రాం నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నారట. కాని త్రివిక్రం హారిక హాసిని బ్యానర్ లోనే ఆ సినిమా చేయాలని అంటున్నాడట. జులాయి నుండి రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో వరకు త్రివిక్రం సినిమా అంటే హారిక హాసిని బ్యానర్ లో మాత్రమే ఉంటుంది.

 

అల వైకుంఠపురములో మాత్రమే గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం అయ్యింది. తారక్ తో సినిమాకు కూడా కళ్యాణ్ రాం ను భాగస్వామ్యం అవ్వమని అంటున్నారట. కళ్యాణ్ రాం మాత్రం సోలోగానే చేయాలని అంటున్నాడట. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా తారక్ 29వ సినిమాగా వస్తుంది. త్రివిక్రం తో చేసే సినిమా తారక్ 30వ సినిమా అవుతుంది. కళ్యాణ్ రాం తన ప్రొడక్షన్ లో త్రివిక్రం డైరక్షన్ లో సినిమా కావాలని పట్టుపడుతున్నాడట. కాని త్రివిక్రం మాత్రం అన్నదమ్ముల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.

 

ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ హారిక హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలయికలో వస్తుందా లేదా అన్నది చూడాలి. తారక్ స్పెషల్ రిక్వెస్ట్ గా త్రివిక్రం ను కన్ విన్స్ చేసే పనిలో ఉన్నాడట. ఇక కథ విషయానికి వస్తే త్రివిక్రం ఈ సినిమాను పొలిటికల్ టచ్ ఉండేలా రాసుకున్నాడట. సినిమా టైటిల్ కూడా అయిననూ పోయి రావలె హస్తినకు అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. అరవింద సమేత సినిమా తర్వాత తారక్, త్రివిక్రం కాంబోలో వస్తున్న క్రేజీ మూవీగా ఈ కాంబినేషన్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: