విజయ్ దేవరకొండ హీరోగా కేయే, వల్లభ నిర్మించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనితో విజయ్ ఈసారి ఏ విధమైన హిట్ కొడతాడో అని అతని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ లో ఉండే సినిమా ఇదీ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం, సినిమా టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆ విధంగానే ఉన్న నేపధ్యంలో ఏ విధంగా కథ ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

ఇక ఈ సినిమాను విజయ్ కాస్త గట్టిగానే ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా విశాఖలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ్ కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాను నటించిన ఏ సినిమాకి వెళ్ళినా సరే మీకు కొత్త అనుభూతి ఉంటుందని గ్యారెంటీ ఇస్తున్నా అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా నా సినిమాలకు బజ్‌  ఉండేది అభిమానుల వల్లే అని తనకు అర్ధమైనట్టు చెప్పాడు. ఈ సందర్భంగా అభిమానులను సరదాగా రౌడీస్ అంటూ విజయ్ సంబోధించాడు. 

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె గురించి కూడా వివరించాడు. తాను ముంబైలో షూటింగులో ఉండటం వలన ఈ సినిమాకి ఎక్కువగా ప్రమోట్‌ చెయ్యలేదని, హీరోయిన్ రాశీఖన్నా అయితే నువ్వు రావాలి, బజ్‌ క్రియేట్‌ చెయ్యాలి, హైప్‌ క్రియేట్‌ చెయ్యాలి అని రోజూ ఫోన్ చేసి నన్ను బెదిరిస్తూ వచ్చింది అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక రాశీ ఖన్నా మాట్లాడుతూ ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో క్యాధరిన్, ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్లు గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: