మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించే ఛాన్స్ దక్కించుకున్నారు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా హిందీ మార్కెట్లో మాత్రం చతికిల పడటం మెగా కాంపౌండ్ ని తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు 50 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తేల్చారు. సైరా రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి తర్వాత మరో భారీ సినిమాని తెరకెక్కించేందుకు స్క్రిప్టును రెడీ చేసి ప్రయత్నాలు సాహించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమాకి సూరి ప్లాన్ చేశారు. అయితే దానికి సంబంధించిన న్యూస్ ఏది రాలేదు. పవన్ ప్రాజెక్ట్స్ లో అసలు సూరి పేరు వినిపించడం లేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికి మరో రెండేళ్ల పాటు తనకోసం ఎదురు చూడాలి చూడాలి. ఆ క్రమంలోనే వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సూరి ప్రయత్నించారు.

 

ఈ ప్రాజెక్టుకు ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఇప్పుడు నో చెప్పారని ఫిల్మ్ నగర్ లో ప్రచారమవుతోంది. సైరా పారితోషికం విషయంలో నిర్మాత రామ్ చరణ్ లతో సూరి ఘర్షణ పడ్డారని.. కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత చరణ్ పై దర్శకసంఘం- నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేశారని ఇటీవల ప్రచారమైంది. ఆ క్రమంలోనే మెగా ప్రిన్స్ తో సూరి డీల్ క్యాన్సిల్ అయ్యిందని చెబుతున్నారు. ఇందుకు చిరు కూడా సపొర్ట్ చేశారట.

 

అయితే ఈ ప్రచారం నిజమా.. అసలేం జరుగుతోంది.. సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ ఎంతో సన్నిహితుడు. ఆ ఇద్దరి మధ్యా చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. చర్చలతో పరిష్కరించుకోవాల్సినది కాస్తా ఫిర్యాదు వరకూ వెళ్లిందా? అంటూ ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే వరుణ్ తేజ్ సూరి తో సినిమాకి నో చెప్పాడన్న ప్రచారంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అయితే ఇదే గనక నిజమైతే ఇక సూరి మెగా ఫ్యామిలీలో మరే హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకోలేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: