మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్రివిక్రమ్ మార్క్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. వసూళ్ళ పరంగా చూస్తే బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. 

ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగులకు అభిమానులు థియేటర్ కి క్యూ కట్టడం సినిమాకు ప్లస్ అయింది. కథ కూడా ఆకట్టుకోవడ౦ కలిసి వచ్చిన అంశం. ఇక ఈ సినిమాకు ఇంకా ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు అల్లు అర్జున్. జాతీయ స్థాయిలో సినిమాను తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే నేషనల్ మీడియా సహకార౦ కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. 

ఎప్పటి నుంచో పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టిన అల్లు అర్జున్, ఈ సినిమా ద్వారా ఆ కోరికను తీర్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే సుకుమార్ సినిమాకు ముందు దీనిని ఇంకా ప్రమోట్ చేస్తున్నాడు. ఇతర భాషల్లో కూడా క్రేజ్ పెంచుకుంటే భవిష్యత్తులో తనకు మరింతగా కలిసి వస్తుందని భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను బాలివుడ్ లో రిమేజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

సినిమా హిందీ రీమేక్ కోసం ఒక సంస్థ ఏకంగా 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. ఈ సినిమా మీద సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపించడంతో ఆ సంస్థ అంత మొత్తం పెట్టి కొనుగోలు చెయ్యాలని భావిస్తుంది.

ఇప్పటికే టాలివుడ్ సినిమాల మీద బాలివుడ్ కన్నేసింది. ఈ సినిమాకు భారీ మార్కెట్ జరగడంతో సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది జూన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. అయితే రీమేక్ రైట్స్ వాళ్లకు ఇవ్వడానికి చిత్ర నిర్మాత అల్లు అరవింద్ అంగీకరించడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: