అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా ఎంతటి సెన్షేషన్ హిట్ సాధించిందో తెలిసిందే. ఏడాది ప్రారంభమే ఇండస్ట్రీ హిట్ తో టాలీవుడ్ ని షేక్ చేసేశాడు. పక్కా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా అల.. వైకుంఠపురములో మరోసారి ఈ మాటల మాంత్రికుడి కలం సత్తా చాటింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాపై ఇప్పడు బాలీవుడ్ కన్ను పడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పెద్ద పోటీనే నడుస్తోంది. ఇందుకు జరిగిన వ్యవహారంలో ఇప్పుడు త్రివిక్రమ్రాధాకృష్ణ వేసుకున్న ప్లాన్స్ కు అల్లు అరవింద్ చెక్ పెట్టాడని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది.

 

 

ఈ సినిమాను బాలీవుడ్ కు రీమేక్ రైట్స్ కు భారీ ఫ్యాన్సీ ఆఫర్ ను తీసుకొచ్చాడట త్రివిక్రమ్. ఈ డీల్ సినిమా నిర్మాతల్లో ఒకరైన రాధాకృష్ణకు కూడా నచ్చిందట. దాదాపు ఎనిమిది కోట్ల ఆ డీల్ ఓకే అనుకుంటున్న తరుణంలో అల్లు అరవింద్ మాత్రం అడ్డు చెప్పాడట. ఇలాంటి సినిమాను తానే హిందీలో పున:నిర్మిస్తానని అంటున్నాడట. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనలో అరవింద్ ఉన్నాడని అంటున్నారు. పార్ట్ నర్ కాబట్టి అరవింద్ మాటకు అడ్డు చెప్పలేకపోతున్నారట. కానీ తాను కూడా పార్ట్ నర్ ని కదా అని రాధాకృష్ణ అనుకుంటున్నాడని టాక్. ఈ వ్యవహారంపై త్రివిక్రమ్ కూడా అలిగాడని అంటున్నాడు.

 

 

అల్లు అరవింద్ కు బాలీవుడ్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. హిందీలో కూడా పలు సినిమాలు తీశాడు. చిరంజీవితో ప్రతిబంద్, ఆజ్ కా గూండారాజ్, అమీర్ ఖాన్ తో గజినీ వంటి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ కొట్టినోడే. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే రీమేక్ పై అరవింద్ స్పందించాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: