విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించడంతో ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇక రు. 30 కోట్ల పై చిలుకు ప్రి రిలీజ్ బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథలోకి వెళ్లినట్టయితే చాలా ఇంట్రస్టిగ్గా ఉంది. కథతో పాటు కథనంలోనూ మలుపులు ఉన్నాయి.
అయితే ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యిందన్న టాక్ వస్తోంది. కథలోకి వెళితే గౌతమ్ (విజయ్ దేవరకొండ) మరియు యామిని(రాశీ ఖన్నా)లు తమ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు.అలాగే మరోపక్క భార్య భర్తలైనటువంటి శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)లు ఓ సామాన్య మధ్య తరగతి జీవనం గడుపుతుంటారు.
ఈ రెండు జంటల కథ ఇలా నడుస్తుండగానే... మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ కథలో (స్మిత) క్యాథెరిన్ మరియు ఇజబెల్ లేయిట్ ఎంట్రీ ఇస్తారు.. అక్కడ నుంచి కథనంలో మలుపులు కూడా ఉంటాయి. అయితే వీటిని ఆసక్తి కరంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రమే దర్శకుడు విఫల మైనట్టు సినిమా చూసిన ప్రేక్షకులు చెపుతున్నారు. ఇక విజయ్ టార్గెట్ ఈ సినిమాతో రు. 30 కోట్లకు పైనే ఉంది. రెండు ప్లాప్ల తర్వాత ఇది విజయ్కు బిగ్ టార్గెట్టే అని చెప్పాలి.
ఇక థియేట్రిలక్ బిజినెస్ ద్వారా రు. 30 కోట్లతో పాటు శాటిలైట్ రైట్స్.. ఓటీటీ రైట్స్.. ఆడియో రైట్స్ ఇతర రైట్స్ ద్వారా మరో పది కోట్ల వరకు నిర్మాత ఖాతాలో పడ్డట్లుగా తెలుస్తోంది. మరి ఈ బిలో యావరేజ్ టాక్తో విజయ్ ఇంత మొత్తం రాబడతాడా ? లేదా ? అన్నది చూడాలి.