సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ ఇమేజ్ హీరోయిన్లలో నయనతార ప్లేస్ టాప్ లో ఉంటుంది. 17ఏళ్ల లాంగ్ కెరీర్ ఆమె సొంతం. ఇప్పటికీ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు వెనుకాడరు.. దర్శకులకు కూడా నయన్ మెయిన్ చాయిస్ గా ఉంది. హీరోలు కూడా ఆమెను కాదనలేరు. తమిళనాడులో ఆమెకు స్టార్ హీరోలతో సమానంగా కటౌట్ లు పెడతారంటేనే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ నయన్ తన కెరీర్ లో కీలక డెసిషన్ తీసుకుందని అంటున్నారు.

 

 

ఇకపై చేసే సినిమాల్లో కాస్త్ గ్లామర్ షో పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుదీర్ఘ కాలం కొనసాగుతున్న కెరీర్ మరికొన్నాళ్లు ఉండాలంటే స్కిన్ షో తప్పదని భావించిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఐదారేళ్ల క్రితం వరకూ గ్లామర్ డ్రెస్సింగ్, ఎక్స్ పోజింగ్ తో పాటు బికినీ కూడా వేసింది. విశాల్ తో దశాబ్దం క్రితం చేసిన సెల్యూట్ సినిమాలో తన రెగ్యులర్ రెమ్యునరేషన్ తోపాటు ఓ పాటలో స్కిన్ షో కోసం ఎక్స్ ట్రాగా 50లక్షలు తీసుకుందని అప్పట్లో టాక్. ఈ విషయం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తర్వాత రోజుల్లో నయన్ స్కిన్ షోకి దూరమైపోయింది. జైసింహ సినిమాలో బాలకృష్ణతో ఓ పాటలో అయితే కనీసం నయన్ మీద బాలయ్య చేయి వేసిన సీన్ కూడా లేకుండా పాట తీశారు.

 

 

అంతలా ఫుల్ డ్రెస్సింగ్, శారీలతోనే లీడ్ లో కొనసాగుతోంది. అలాంటిది నయన్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం ఆమె అభిమానులకు, దర్శక – నిర్మాతలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సౌత్ లో నయన్ కు అభిమానులు కూడా బాగానే ఉన్నారు. క్రేజ్ ఉంది. ఈ సమయంలో నయన్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: