ప్రస్థుతం ఆరోగ్య కారణాల రీత్యా అమెరికాలో ఉంటున్న మహేష్ మళ్ళీ హైదరాబాద్ తిరిగి రావడానికి మరో నెల రోజులు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్న మహేష్ తన ఖాళీ సమయాన్ని వివిధ భాషలకు సంబంధించిన అనేక హిట్ సినిమాలు చూస్తూ ప్రేక్షకుల ట్రెండ్ ఎలా మారింది అన్న విషయమై అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇలాంటి పరిస్థితులలో మహేష్ అమెరికాలో ‘అల వైకుంఠపురములో’ మూవీ చూసాడని ఆ మూవీని ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ మూవీ చూసిన తరువాత మహేష్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి అతడిని అభినంధించడమే కాకుండా ఆ మూవీలో తనకు నచ్చిన సీన్స్ గురించి సుమారు 40 నిముషాలు మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ ల నుండి ఎప్పుడో వారి కాంబినేషన్ లో మూడవ సినిమా రావలసి ఉంది.


అయితే మహేష్ ఆ ప్రాజెక్ట్ పై శ్రద్ద పెట్టక పోవడంతో త్రివిక్రమ్ మిగతా హీరోలతో సినిమాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ‘అల’ కారణంగా వీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకున్నారు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 


సినిమాలలో సంభాషణలను చాల పొదుపుగా వాడే త్రివిక్రమ్ శైలి మహేష్ బాడీ లాంగ్వేజ్ కు బాగా సరిపోతుంది. దీనికితోడు వీరిద్దరి కాంబినేషన్ అంటే ఓవర్సీస్ లో డాలర్ల వర్షం కురుస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తో ‘అల’ కు చెక్ పెట్టాలని ప్రయత్నించిన మహేష్ ఏకంగా తానే స్వయంగా ‘అల’ మూవీని చూసాడు అని వార్తలు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వార్తలు విని బన్నీ అభిమానులు కూడ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: