మహేష్బాబు తల్లి ఇందిరాదేవి. సూపర్స్టార్ కృష్ణ మొదటి భార్య. మొదటి భార్య అని ఎందుకన్నామంటే ఒక ఆడది భర్తలోని ఏ గుణాన్నైనా జీర్ణించుకోగలదు కానీ భర్త మరో ఆడదానికి జీవితాన్ని పంచుకుంటే మాత్రం సహించలేదు. అయినా కూడా ఇందిరాదేవి సర్దుకుపోయిందంటే ఆమె తన భర్త ఇష్టమే తన ఇష్టంగా భావించింది. ఆమెకు కృష్ణ అంటే విపరీతమైన ప్రేమ. అలాగే ఇంటిగుట్టు బయటకు ఈడ్చకూడదన్న సమయమనం కూడా ఉంది. ఈ రెండు గుణాలు ఉన్న మహాఇల్లాలు ప్రిన్స్ మహేష్బాబు తల్లి ఇందిరాదేవి. సూపర్స్టార్ కృష్ణ అనగానే అయన నటించిన తిరుగులేని చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాగే మహేష్బాబు అంటే ఆయన వారసత్వం పునికిపుచ్చుకోవడమే కాకుండా మకుటం లేని రాజకుమారుడిగా ఇండస్ట్రీలో పేరు గాంచాడు. ఇక మహేష్బాబు భార్య నమ్రత కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్. ఇందిరాదేవి పెద్దగా పబ్లిక్లోకి రారు. బయట సినిమా ఫంక్షన్లలో కూడా ఆమె కనిపించరు.
కృష్ణ పక్కన ఎప్పుడు చూసిన విజయనిర్మల మాత్రమే కనిపించేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా పెరగడంతో ఆమె గురించి తెలుస్తుంది కానీ ఒకానొక సమయంలో కృష్ణ ఇందిరాదేవిల మధ్య బంధం ఎలా కొనసాగుతుందన్నది కృష్ణ అభిమానులకే తెలియని పరిస్థితి. ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మేనమామ కూతురు. వరసకు ఆయనకు మరదులు అవుతుంది. కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఆమెతో వివాహమయింది. గూఢాచారి 116 హిట్ అయిన తర్వాత ఆయన కెరియర్ మొత్తం మారిపోయింది. ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అదే సమయంలో విజయనిర్మల కృష్ణ పక్కన వరుసగా హీరోయిన్గా నటించింది. అదే సమయంలో వారిద్దరికి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తరువాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. కృష్ణ విజయనిర్మలతో ప్రేమ గురించి ఇందిరాదేవితో సహా అందరికి చెప్పేశారు.
అయినా కూడా ఇందిరాదేవి తాను బ్రతికినంతకాలం కృష్ణభార్యగానే ఉండిపోతానని తేల్చి చెప్పారు. ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్న నాలుగు సంవత్సరాలికే విజయనిర్మలతో పెళ్ళయింది. అయినప్పటికీ ఇందిరాదేవితో కూడా కలిసి ఉండేవారు కృష్ణ. కృష్ణ ఇందిరాదేవిలకు మొత్తం ఐదుగురు సంతానం. కృష్ణ విజయనిర్మలతో ఉన్నప్పటికీ ఇందిరాదేవిని ఎప్పుడూ బాగానే చూసేవారు. వారిద్దరు కూడా ఎప్పుడూ ఆనందంగానే ఉండేవారు. కృష్ణ పిల్లలకు ఇందిరాదేవి అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకే మంజుల తన సొంతప్రొడక్షన్ హౌస్కి ఇందిరా ప్రొడక్షన్స్ అని పెట్టుకుంది. ఇక మహేష్బాబుకి తల్లి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ ఎక్కువగా తల్లితోనే ఉండేవారు. ఇప్పటికీ ఆయన కాస్త సమయం దొరికినా కూడా తన తల్లితో సమయాన్ని గడుపుతారు. ఇక ఆమె ఇప్పుడు రమేష్బాబుతో ఉంటుంది. ఆమె అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం.ఇక పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఒకరి విషయంలో తేడా రావడంతో కృష్ణ, ఇందిరాదేవికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని అంటారు.