భారతీయ చలన చిత్ర రంగంలో ఆ ఇద్దరు నటులకు ఎంతో ప్రత్యేకత ఉంది.  ఒకప్పుడు ఇద్దరూ కలిసి కెరీర్  ప్రారంభించారు. ఇప్పడు ప్రపంచం మెచ్చుకునే స్థాయి హీరోలు అయ్యారు.  అంతే కాదు రాజకీయాల్లో కూడా ఈ ఇద్దరు అడుగు పెట్టారు.  ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్.. మరొకరు విశ్వనటులు కమల్ హాసన్.   ఈ లెజండరీ నటులిద్దరూ దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  సూపర్ స్టార్‌గా రజనీ, విశ్వనటుడు కమల్ తమిళనాట జెండా పాతారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీ చైనా, జపాన్, మలేషియా వంటి దేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. 

 

అయితే ఈ ఇద్దరు నటులకు తమకంటూ ప్రత్యేకతలు ఉన్నాయి. స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ రజినీకాంత్ అయితే.. ఎలాంటి ప్రయోగాత్మక పాత్రలైనా కమల్ హాసన్ తర్వాత ఎవరైనా అనే స్థాయిలో తను పోషించే పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కమల్. ఇటీవల కాలంలో ఈ స్టార్‌లిద్దరు రాజకీయాల వైపు మొగ్గు చూపారు. కమల్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని స్థాపించారు. ఇన్నాళ్లూ మల్టీ స్టారర్ చేయమంటే సరైన కథ దొరకాలి అని చెప్పిన రజనీ, కమల్ ఇప్పుడు కలిసి నటించాలని డిసైడ్ అయినట్లు కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

ఒకప్పుడు రజినీకాంత్.. కమల్ హాసన్ లు కలిసి అనేక సినిమాలు చేశారు. కె బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమాలు వచ్చాయి.  ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ వీరిద్దరి ఇమేజ్‌కి తగ్గట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కథ తయారుచేసి వినిపించగా రజనీ, కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.  అయితే ఇది ఎప్పుడు పట్టాలు ఎక్కనుందో అన్న విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తే కానీ తెలియదు. ప్రస్తుతం కమల్ ‘ఇండియన్ 2’, రజనీ తన 168వ సినిమాలతో బిజీగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: