ఈ సంక్రాంతికి పోటీ పడ్డ మహేశ్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. అయితే.. ఇద్దరు హీరోలు మిగిలిన సమయాల్లో ఇతర హీరోల సినిమాలు చూసి తమ ఒపీనియన్స్ కూడా షేర్ చేస్తారు. కానీ ఈసారి తమ సినిమాలకు ప్రమోషన్స్ చేసుకోవడంలోనే బిజీగా మారిపోయారు. దీంతో ఒకరికొకరు ఈ రెండు సినిమాలు చూసారో లేదో ఎవరికీ తెలీలేదు. కానీ బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాను మహేశ్ చూశాడని ఫిలింనగర్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

 

సరిలేరు సినిమా ప్రమోషన్స్ పూర్తవగానే మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెకేషన్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మహేశ్ మోకాలికి ఆపరేషన్ జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే.. మహేశ్ తీరిక సమయం చూసుకుని బన్నీ అల.. వైకుంఠపురములో సినిమా ఫ్యామిలీతో కలిసి చూశాడని ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అల.. ను ఫ్యామిలీతో కలిసి చేసి మహేశ్ ఎంజాయ్ చేశాడని టాక్. సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు ఎంతటి పోటీ పడ్డాయో తెలిసిన విషయమే. రిలీజ్ డేట్స్ దగ్గర నుంచి కలెక్షన్స్ వరకూ ఓ సినిమా యుద్ధమే జరిగింది. గతంలో మరే సంక్రాంతికి కూడా ఇంతటి పోటీ.. పంతం.. హడావిడీ జరగలేదు. దీంతో మహేశ్ అల.. చూశాడన్న టాక్ ఆసక్తికరంగా మారింది.

 

 

మహేశ్ తర్వాతి సినిమాల లిస్టులో త్రివిక్రమ్ తో కమిట్ మెంట్ ఉంది. పైగా త్రివిక్రమ్ తో మహేశ్ రెండు సినిమాలు కూడా చేశాడు. మహేశ్ సినిమాతో పోలిస్తే బన్నీ సినిమానే కలెక్షన్స్ లో టాప్ గా నిలిచి ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించేసింది. మరి.. మహేశ్ సరిలేరు..ను బన్నీ చూశాడో  లేదో తెలియాల్సి ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: