తెలుగు ఇండస్ట్రీలో అందాల రాక్షసి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. నాని హీరోగా 2017 లో వచ్చిన ‘నేను లోకల్’ చిత్రంలో విలన్ ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు. ఆ తర్వాత దేవదాస్ చిత్రంలో విలన్ గా నటించాడు. ఇలా ఏ తరహా పాత్రలకైనా సిద్దమైన నటిస్తున్న నవీన్ చంద్ర తాజాగా తమిళంలో ధనుష్ నటించిన పటాస్.. తెలుగులో లోకల్ బాయ్ చిత్రంలో కూడా విలన్ గా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ రోల్స్తో తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్గా ‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్ చేశారు.
చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తుండగా సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం లో పోస్టర్ కూడా చాలా డిఫరెంట్ ప్రేమ కథనే కన్నులకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత నిర్మాత కళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ...దిల్ రాజు మా సినిమా ఫస్ట్ లుక్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథలు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది.
ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రేమ కథకి దగ్గరవుతారు. ఈ చిత్రం రెండు భిన్నమైన కోణాల్లో ఉండబోతుందని.. ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని అన్నారు. సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన గాయత్రి ఆర్ సురేష్ హీరోయిన్గా నటించింది. క్రిష్ సిద్దిపల్లి, అదితిలు మరో ముఖ్య పాత్రల్లో నటించారు. రాజారవీంద్ర కీలక పాత్రలో నటించారు.