టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి2 మూవీ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు.  ఈ గ్యాప్ లో ఆయన ఓ బారీ సినిమాకు ప్లాన్ చేశారు.  టాలీవుడ్ లో టాప్ హీరోలుగా రాణిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఆర్ఆర్ఆర్ మూవీ గా ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని అంటున్నారు.  ఆ సినిమా పూర్తైన వెంటనే దానిని మించిన రీతిలో మరో మల్టీస్టారర్‌కి ప్లాన్ వేస్తున్నాడట.  ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఓటమి ఎరుగని రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీ మేకర్ గా మంచి పేరు సంపాదించారు.  


ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఎన్టీఆర్-రామ్‌ చరణ్ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'.. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.  అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కాస్త గందరగోళం వస్తున్నా.. త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే యోచనలో ఉన్నారట రాజమౌళి.  ఈ మూవీ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. వాస్తవానికి మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది.  కాకపోతే ఈ విషయంపై చర్చలు నడుస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి 

 

కె.ఎల్.నారాయణ ఆ మూవీ నిర్మించనున్నాడు. ట్విస్ట్ ఏంటంటే..  సినిమా కోసం ప్రభాస్‌ని కూడా లైన్లో పెడుతున్నాడట. 'ఆర్.ఆర్.ఆర్'కి మించిన రీతిలో మహేశ్-ప్రభాస్‌తో భారీ మల్టీస్టారర్‌కి ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. కె.ఎల్.నారాయణతో పాటు యు.వి.క్రియేషన్స్‌ కూడా ఆ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు టాక్.  కాకపోతే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎలాంటి క్లారిటీ లేదు.  అయితే ఇదే గనక జరిగితే మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: