టాలీవుడ్ లోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగార్జున... ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్య తర్వాత maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా పేరు తీసుకురాకపోయినా.. హీరోగా తన కెరీర్ కి ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగిస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాలో తన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది ఈ జంట కలిసి నటించిన ‘మజిలీ’ మంచి హిట్ అయ్యింది.
ఈ తర్వాత తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో ‘వెంకిమామ’ మూవీతో మరో ఘన విజయం అందుకున్నాడు. ఇలా వరుస విజయాలు అందుకుంటున్న నాగ చైతన్య తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్ గా ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాలంటేన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'ఏ పిల్లా' ను రిలీజ్ చేశారు. ఒకమ్మాయి అబ్బాయి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది అనే విషయాలను ఈ సాంగ్ లో చూపించారు. సాయి పల్లవి తన పక్కనే కూర్చున్న చైతును ముద్దుపెట్టుకుంటుంది.
చుట్టూ చాలామంది ఉంటారు. కానీ, చైతూను సాయి పల్లవి అలా ధైర్యం చేసి ముద్దుపెట్టుకోవడంతో చైతు షాక్ అవుతారు. చైత ఈ సన్నివేశంలో చాలా ఎమోషన్ అవుతూ.. ఒక సామాన్య కుర్రాడు ఎలా ఉంటాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.