ఏ సినిమాకైనా ప్రచారం ఎంత కొత్తగా, వినూత్నంగా చేస్తే అంత పబ్లిసిటీ దక్కుతుంది. సినిమా ప్రేక్షకులకి చేరుతుంది. కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాలు ఇలా పబ్లిసిటీ లేకపోవడం వల్లనే జనాలకి తెలీక ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలీక ఫ్లావతున్నాయి. రీసెంట్‌గా మన తెలుగులో వచ్చిన జాను సినిమా పరిస్థితి కూడా అదే. సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లే సగం సినిమాకి మైనస్ అయింది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య కి హిట్టు పడి చాలా కాలమవుతోంది. సింగం-2 తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు పడలేదు. వరుసగా ఐదారు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. దాంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భాగా డల్ అయ్యాడు సూర్య. 

 

అయితే ప్రస్తుతం 'గురు' ఫేం సుధ కొంగర దర్శకత్వంలో 'సూరారై పొట్రు' అనే సినిమా రెడి అవుతోంది. ఈ సినిమాని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటుంది. ఇటీవల ప్రచారంలో వేడి పెంచింది చిత్ర యూనిట్. కాస్త వెరైటీగా ఈ సినిమాలో ఫస్ట్ లిరికల్ సాంగ్ ను గాల్లో ఎగురుతున్న విమానం ద్వారా రిలీజ్ చేసారు. టైటిల్ కు తగ్గట్టే 'పిల్ల పులి' అనే పాటను ఎగురుతున్న విమానంలో ఆకాశం మధ్యలో రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. దీనికోసం స్పైస్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పబ్లిసిటి స్టంట్ లో టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

ఇలాంటి వెరైటీ పబ్లిసిటి స్టంట్ కోలీవుడ్ లో ఇదే  ఫస్ట్ టైం కావడం విశేషం. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 ప్రచార పోస్టర్లను వివిధ దేశాలకు ప్రయాణించే విమానాలపై అతికించి ప్రచారం చేశారు మేకర్స్. ఇటీవలే విడుదలైన రజనీ దర్బార్ సినిమా విషయంలోనూ అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు మేకర్స్. ఈ సినిమా పోస్టర్లను కూడా స్థానికంగా ఎగిరే విమానాలకు అతికించి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సూర్య సినిమాకి అదే ఫాలో అవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ పబ్లిసిటి సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: