విజయ్ దేవరకొండ... ఇపుడు అందరూ అతన్ని నటుడు అని మాత్రమే కాదు, ది పర్ఫెక్ట్ బిజినెస్‌మేన్ ఆఫ్ టాలీవుడ్.. అని కితాబిస్తున్నారు. ఆయన రౌడీ వేర్ బ్రాండ్ మొదలుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్లోతింగ్ బిజినెస్ మార్కెట్లో ఇపుడు దుమ్ము లేపుతోంది. ఇక ఇప్పుడు దీనికి అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు. అదేంటి విచిత్రంగా అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఎందుకు విజయ్ రౌడీ వేర్ ప్రమోట్ చేస్తాడు అనుకుంటున్నారా..? వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరిగింది. 

 

అయితే నేరుగా కాకుండా తన కొడుకుతో దీనికి బ్రాండింగ్ చేసాడు బన్నీ. అసలు విషయం ఏంటంటే గీతా ఆర్ట్స్ 2లో తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమా ఓపెనింగ్ జరిగింది. కార్తికేయ ఇందులో హీరో. ఈ ఓపెనింగ్ సందర్భంగా బన్నీ కొడుకు అయాన్ కూడా వచ్చాడు. అక్కడ ఆ కుర్రాడి సందడి కూడా మామూలుగా లేదు. ఈ మధ్య అల్లు అయాన్ బయట బాగానే కనిపిస్తున్నాడు. అల వైకుంఠపురములో సెట్స్‌లో కూడా చాలా అల్లరి చేసాడు అయాన్. ఇప్పుడు కార్తికేయ సినిమా ఓపెనింగ్‌లో కూడా యాక్షన్ కట్ అంటూ అల్లరి అల్లరి చేసేసాడు ఈ బుడ్డోడు. 

 

అంతవరకూ ఓకే గాని, ఈ ఓపెనింగ్‌కు బన్నీ కొడుకు వేసుకొచ్చిన డ్రస్ మాత్రం ఇక్కడ బాగా హైలైట్ అయింది. అందులో మనోడు రౌడీ వేర్ వేసుకొచ్చాడు. అల్లు అయాన్ వేసుకున్న రౌడీ చొక్కా బాగా ట్రెండ్ అవుతుందిప్పుడు. తన కొడుక్కి విజయ్ దేవరకొండ బ్రాండ్ దుస్తులు కొనిచ్చాడు అల్లు అర్జున్. ఈ ఒక్క డ్రస్‌‌తో అయాన్‌తో పాటు విజయ్ రౌడీ బ్రాండ్‌కు కూడా మరింత గిరాకీ పెరిగిపోయింది. మొత్తానికి అల్లు అర్జున్‌తో విజయ్ దేవరకొండకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఇదే కనిపిస్తుంది కూడా. 

 

ఒకవైపు హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నాడు విజయ్. అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు ఈ హీరో. రౌడీ వేర్ అంటూ ఏడాదిన్నర కింద ఒక క్లోతింగ్ బిజినెస్ మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం తర్వాత ఈయన తన క్రేజ్‌ను పెట్టుబడిగా పెట్టి మార్కెట్‌లోకి ఈ బ్రాండింగ్ తీసుకొచ్చాడు. అది కాస్తా సంచలనం అయిపోయింది. కుర్రాళ్ళు ఎక్కడ చూసినా కూడా రౌడీ బ్రాండ్ వేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారిప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: