స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నాడు. భయంకరమైన ఫ్లాప్ ‘నా పేరు సూర్య’ లాంటి  సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చాలా స్టోరీలు విని చివరాఖరికి తన కెరీర్లో మర్చిపోలేని రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ చెప్పిన ‘అల వైకుంఠపురములో’ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సినిమా షూటింగ్ వెంటనే మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే కాబట్టి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు బన్నీ. సినిమా ప్రస్తుతం ఇంకా సినిమా హాల్ లో రన్ అవుతూనే ఉంది. చాలావరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ ‘బాహుబలి’ రికార్డులు ఈ సినిమా పగలగొట్టడం జరిగింది.

 

మొన్నటి వరకు సినిమాకి సంబంధించి సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న అల్లు అర్జున్ తాజాగా పాన్ ఇండియా సినిమా పై కన్నేసినట్టు వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతున్నయి. ఇటీవల అల వైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత జాతీయ మీడియా ఛానల్స్ కి కూడా అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. తన కెరీర్ గురించి అనేక విషయాలు గురించి మాట్లాడిన అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.

 

మేటర్ లోకి వెళ్తే బొంబాయిలోకి ఇటీవల బన్నీ మకాం మార్చినట్లు ఓ భారీ ఇల్లు కొనుగోలు చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించడానికి మరియు ఇల్లు కొనడానికి సంబంధం లేదని...హైదరాబాదు తర్వాత నాకు నచ్చిన నగరం ముంబై అందువలన ఇక్కడ ఇల్లు కొన్న ఆయన తెలిపాడు. అంతేకాకుండా ఛాన్స్ వస్తే స్టైట్ బాలీవుడ్ చిత్రంలో నటించాలని తనకూ ఉందని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ దిశగా ప్రస్తుతానికి బలమైన అడుగులు పడలేదని, అవకాశం వస్తే నటిస్తానని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: