టాటూ... చాలా మందికి ఇది అంటే ఒకరకంగా పిచ్చి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళు, సిని, క్రికెట్ ప్రముఖులకు టాటూ అంటే ఒక పిచ్చి, ఫ్యాషన్ కూడా. అయితే ఇది ఈ మధ్య కాస్త హద్దు మీరుతుంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ల కోసం, వచ్చే లైక్స్ కోసం కొందరు చేసే అతి పనులు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. టాటూకి ఎక్కడా చోటు లేనట్టు కొందరు హీరోయిన్లు, సీనియర్ నటీ నటులు వేసుకుంటున్న ప్రదేశాలు ఇప్పుడు విమర్శలకు వేదికగా మారుతున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు ఫాన్స్. 

 

ఎమ్మెల్యే ఆర్కే రోజా, త్రిష, యాంకర్ అనసూయ, పూనం కౌర్ సహా టాటూలు వేసిన ప్రదేశాలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వీళ్ళు ఆ టాటూ కనపడే విధంగా పెట్టే పోస్ట్ లు విమర్శలకు వేదికగా మారుతున్నాయి. వయసు వచ్చినా, పెళ్ళిళ్ళు అయినా సరే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత వరకు భావ్యం కాదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం ఆ విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రం భావ్యం కాదని అంటున్నారు పలువురు.

 

సమాజానికి నటులు మెసేజ్ ఇవ్వాలి గాని ఈ విధంగా లేకి తనంగా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్నారు. ఇవి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు. వీటి ద్వారా యూత్ ని రెచ్చగొడుతున్నారని, అమ్మాయిలను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు పలువురు. ఎమ్మెల్యే పదవుల్లో ఉండాల్సిన వాళ్ళు, పెళ్లి అయి పిల్లలు ఉన్న యాంకర్లు చేసే పనులు అవి కాదని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా వాటిని చూపించే విధానం, హావభావాలు అన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని దుమ్మెత్తి పోస్తున్నారు సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: