దర్శకులంతా హీరోలు ఎలా ఉన్నప్పటికీ తమకు నచ్చిన విధంగా తమ సినిమాకు తగినట్లుగా హీరోలను మారుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలా ఎక్కువగా హీరోలను మార్చే దర్శకులలో గుర్తొచ్చే పేరు మణిరత్నం. మణిరత్నం సినిమా అంటే ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది.  హీరోలను  కూడా తన సినిమాకు తగ్గట్టుగా మార్చడంలో మణిరత్నం దిట్ట. మణిరత్నం దశాబ్దాల కెరీర్లో ఎంతో మంది హీరోలను సాన పట్టారు. అరవిందస్వామి మోహన్లాల్ సురేష్ గోసి చియాన్ విక్రమ్ సూర్య మాధవన్ దుల్కర్ సల్మాన్ యంగ్ కార్తీక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోలు దర్శకుడు మణిరత్నం వద్ద నటనలో ఎన్నో మెళుకువలు తెలుసుకున్నారు. అంతేకాకుండా సినిమా కోసం తమను తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అనే దానిపై కూడా అవగాహన పొందారు. 

 


 ఇక్కడ ప్రస్తుతం కార్తి జయం రవి వంటి స్టార్ లకి కూడా ఈ శిక్షణ తప్పినట్లు కనిపించడం లేదు. తాజాగా విమానాశ్రయంలో కనిపించిన  కోలీవుడ్ సార్లు కార్తీ జయం రవి కొత్త లుక్ చూడగానే ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. వీరిద్దరు ఎంతో భిన్నంగా కనిపిస్తోన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న తాజా మూవీ పొన్నియన్ సెల్వన్... వీరిద్దరు ఈ సినిమాలో  ఒక కొత్తగా కనిపించబోతున్నట్లు  తెలుస్తోంది. అయితే దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా పొన్నియన్ సెల్వన్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది, శుక్రవారం నాడు హైదరాబాద్ లో కనిపించారు ఇద్దరు స్టార్లు . కాగా ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చారిత్రాత్మకమైన మూవీగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా ఎంతో విభిన్నంగా ఉండబోతోందని అర్థమవుతుంది. 

 


 కాగా ఈ సినిమాలో పాత్రలకు తగ్గట్టుగా హీరో  కార్తీ జయం రవి లు తమ గెటప్ లను  మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి కొంతమంది ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా  రోజురోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: