టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ తర్వాత కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న పూరి, కొన్నాళ్ల క్రితం మాత్రం వరుస పరాజయాలు చవి చూశారు. ఇక ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ తో మళ్లీ పూరి ఫామ్ లోకి రావడం జరిగింది. మరోవైపు నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన చార్మి కౌర్, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి వరుస అవకాశాలతో ముందుకు సాగింది. అయితే ఇటీవల మధ్యలో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, అవి అంతగా ఆమెకు గుర్తింపు ఇవ్వలేకపోయాయి. 

 

దానితో 2015వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తానే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా జ్యోతిలక్ష్మి. ఇక అక్కడి నుండి పూరి దర్శకత్వంలో వస్తున్న ప్రతి ఒక్క సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి, ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పూరి తీస్తున్న ఫైటర్ కూడా ఆమె సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే జ్యోతిలక్ష్మి సినిమా నుంచి పూరి, ఛార్మి మధ్య సంబంధంపై కొన్ని కథనాలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని, అలానే పూరిపై ఛార్మికి ప్రేమ ఉందని, ఎవరికీ తెలియకుండా వారిద్దరూ రహస్య సంబంధాన్ని నడుపుతున్నారని పలు విధాలుగా వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని అటు పూరి గాని, ఇటు చార్మి గాని వాటిని పెద్దగా లక్ష్యపెట్టకుండా తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక ఇటీవల పూరి సన్నిహితుడు ఒకరు, వారిద్దరి సంబంధం గురించి కొన్ని విషయాలు వెల్లడించినట్లు సమాచారం. 

 

నిజానికి మీడియాలో ప్రచారం అవుతున్న విధంగా పూరి, ఛార్మిల మధ్య ఎటువంటి తప్పుడు సంబంధం లేదని, హీరోయిన్ దశ నుండి నిర్మాతగా మారిన ఛార్మికి, పూరి వర్కింగ్ స్టయిల్ బాగా నచ్చి, అక్కడినుండి ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్నారని, అయితే ఈ ట్రావెల్ లో వారిద్దరి మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడిందని, అంతే తప్ప మరెటువంటి తప్పుడు సంబంధం లేదని,  కావున దయచేసి ఇకపై మీడియాలో ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరినట్లు సమాచారం. ఇక ఇటీవల బయటికి వచ్చిన వార్తలతో పూరి, ఛార్మి ల గురించి ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలకు చాలావరకు అడ్డుకట్ట పడ్డట్లయింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: