శేఖర్ కమ్ముల సినిమాలకి ఒక నేం ఒక బ్రాండ్ ఉన్నాయి. ఆయన నుండి సినిమా వస్తుందంటే ఆ సినిమా ఆనంద్, గోదావరి, ఫిదా లాగా అందంగా.. అద్భుతంగా ఉంటుందనుకుంటారు ప్రేక్షకులు. ఆయన సినిమాలలో ఎక్కువగా హంగు ఆర్భాటాలుండవు, హీరోయిన్ ఘాటుగా అందాలు ఆరబోయదు. అయినా ఏదో తెలియని అందమైన రొమాన్స్ కనిపిస్తుంటుంది. అదే ప్రేక్షకులుకని బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలలో ఇప్పటి వరకు ఒక డీప్ లిప్ లాక్ లేకపోవడం విశేషం. ఇక ఆయన ఫిదా వంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య - సాయిపల్లవి జంటగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లవ్ స్టోరి'. 

 

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ మూవీతోనే సినీనిర్మాణంలోకి అడుగు పెడుతోంది. ఫిదా లాంటి క్లాసిక్ లవ్ స్టోరి తర్వాత కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చక్కని అంచనాలే ఉన్నాయి. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ తో సాయి పల్లవి రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. మరోసారి అలాంటి రొమాన్స్ చైతూతో సాయి పల్లవికి కుదురిందని ఇప్పటికే పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది. 

 

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఏయ్ పిల్లా..! అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ టీజర్ లో రన్నింగ్ ట్రైన్ లో చుట్టూ జనం ఉండగానే సాయి పల్లవి చైతూ కి చటుక్కున ముద్దు పెట్టి .. ముద్దు పెడితే ఏడుస్తారా అమ్మా! అంటూ చైతూపై పంచ్ వేయడం అదిరిపోయింది. ఈ సాంగ్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శేఖర్ కమ్ముల శైలి సెన్సిబిలిటీస్ తో లవ్ స్టోరి నచ్చుతుందని ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చైతూ - సాయి పల్లవి పక్కా తెలంగాణ యాస మాట్లాడుతారట. పల్లె నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన ప్రేమికులుగా కనిపించనున్నారట. ఇక లవ్ స్టోరి సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సాంగ్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి జనాలు శేఖర్ కమ్ముల హీరో హిరోయిన్స్ తో ముద్దులు పెట్టిస్తున్నాడని ఆత్రంగా చెప్పుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: