ఏడాది క్రితం విడుదలై ఎవరూ ఊహించని భారీ విజయం సాధించిన సినిమా కేజీఎఫ్. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమాలో పెన ప్రకంపనాలు సృష్టించింది. నిజానికి కన్నడ నుంచి ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించి ఉండరు. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాలీవుడ్ ని సైతం విస్మయపరిచేలా విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పుడీ సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ రౌండ్ అవుతోంది.

 

 

కేజీఎఫ్2 గా రాబోతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం అన్ని భాషల సినిమా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మొన్న జనవరి 8న యాష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందని ఆందరూ భావించారు. కానీ.. దర్శకుడు వీరందరి ఆశలపై నీళ్లు జల్లేశాడు. మరోపక్క ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి టీజర్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న అభిమానులకు ఓ న్యూస్ ఊరటనిస్తోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 21న కేజీఎఫ్2 టీజర్ వస్తుందని.. ఇది పక్కా అని శాండల్ ఉడ్ లో ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

 

 

ఈ న్యూస్ యాష్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కు ఆనందాన్నిస్తోంది. కేజీఎఫ్ సినిమా తీసిన విధానం, యాష్ నటన, కథనం అన్నీ కలిపి సినిమాను భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచాయి. ఈ సినిమాకు ఫిదా అయిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కేజీఎఫ్2లో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి కేజీఎఫ్2 ఏమేరకు సంచలనం సృష్టిస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: