యాంగ్ టైగర్ ఎన్టీఆర్..  ఎందరో అభిమానుల శ్వాస.. మొన్ననే అరవింద సామెత సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు భారీ చిత్రమైన ఆర్ఆర్ఆర్ లో మల్టి స్టార్ గా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వదులుతావు రాజమౌళి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. 

 

అయితే ఈ సినిమా విడుదల ఇప్పట్లో ఉండదు అని రాజమౌళి తేల్చేయడంతో నిరాశతో ఉన్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఆ విషయం ఏంటో తెలిస్తే అవునా అని మీరు కూడా షాక్ అయిపోతారు.. అంతటి షాకింగ్ వార్త అది.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే..  

 

2009లో తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ ఒక ఊరికి వస్తున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో వారు ఎన్టీఆర్ ని చూడటం కోసం ఆ ఉరికి వచ్చేవారు.. ఎన్టీఆర్ ప్రచారం చూసి అప్పట్లో ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ షాక్ కి గురయ్యారు అంటే నమ్మరు.. 

 

ఇంకా అలాంటి సమయంలోనే ఓ దారుణమైన ఘోరమైన.. ఎన్టీఆర్ జీవితంలో మరిచిపోలేని ఘటన ఒకటి జరిగింది. అది ఏంటి అంటే? యాక్సిడెంట్. ఎన్టీఆర్ ప్రచారం చేసి వస్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనపై ఎందరో సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

కానీ కారు ప్రమాదం జరిగిన సమయంలో ఎన్టీఆర్ తో పాటు ఉన్న రాజీవ్ కనకాల కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు.. అవి ఏంటి అంటే ? కారు ప్రమాదం జరిగినప్పుడు కారుని డ్రైవర్ డ్రైవ్ చేశాడు అని.. కుక్క లాంటిది ఏదో అడ్డు రావడం వల్లే ఆ యాక్సిడెంట్ అయ్యింది అని.. అంతే తప్ప మారేది కారణం కాదు అని రాజీవ్ కనకాల చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ విషయం అప్పట్లో సంచలనమైన సంగతి అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: