నిన్న ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య సాయి పల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ మూవీకి సంబంధించిన ఒక పాటను విడుదల చేసారు. ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా ఏవైపో జంటగ ఉందామా’ అంటూ సాగే ఈ ప్రేమ గీతంలో సాయి పల్లవి నాగచైతన్యను ముద్దు పెట్టుకుంటే చైతన్య భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం చూసిన వారు చాల ఎంజాయ్ చేసారు. 


నిన్నటిరోజు విడుదలైన ఈ పాటకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇదే వీడియోలో ‘ఏందీ ముద్దు పెడితే ఏడుస్తారా బ్బా’ అంటూ సాయి పల్లవి సంభాషణ విన్న సమంత వెరైటీగా స్పందించింది. ‘చైతన్య అంతే ప్లీజ్ వదిలేయ్’ అంటూ జోక్ చేస్తూ ఈ పాటను తాను కూడ ఎంజాయ్ చేసాను అంటూ కామెంట్ చేసింది.  


సమ్మర్ ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ మూవీకి శేఖర్ కమ్ముల కూడ ఊహించని స్థాయిలో ఇప్పుడు అన్ని ఏరియాల నుండి ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ జరుగుతోంది. ఈ మూవీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రేమికులుగా చైతన్య సాయి పల్లవి లు కనిపించ బోతున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గా నటిస్తూ ఉంటే చైతన్య ఆమె ప్రేమ పొందడం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకునే యువకుడుగా కనిపిస్తూ అతడు ప్రేమ కోసం పడే పాట్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తాయి అని అంటున్నారు.


శేఖర్ కమ్ముల కు సెంటిమెంట్స్ ఎక్కువ అందువల్లన తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘ఫిదా’ షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ఈ మూవీ షూటింగ్ ను కొంత తీసారు. వాస్తవానికి శేఖర్ కమ్ముల హైదరాబాద్ లో సెటిల్ అయినా గతంలో అతడి సినిమాలు అన్నీ గోదావరి ప్రాంత నేపధ్యంలో ఉండేవి. అయితే ‘ఫిదా’ సూపర్ సక్సస్ తో తెలంగాణ సెంటిమెంట్ బాగా అచ్చి రావడంతో ఈ మూవీలో కూడ అదే ప్రాంత నేపద్యాన్ని కొనసాగిస్తున్నాడు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: