టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య సినిమాల పరంగా ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి ఆయన స్థానం ఆక్రమించుకుని నెంబర్ వన్ హీరోగా పెరగడంతో పాటు నాటి నుంచి నేటి వరకు అదే నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. ఇక దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం కోసం చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ మధ్య పెద్ద యుద్ధం నడిచింది. టాలీవుడ్ లో మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య కూడా అదే రేంజ్ లో నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మెగా హీరోలు సినిమాల్లోకి రాణిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ కి  హీరోలకు బాగా అవుతున్నట్లు కనిపిస్తోంది.

 

అటు మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా ఇస్తూనే ఉంటాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ను బావా బావా అంటూ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో క‌లుసుకుంటాడు. ఎన్టీఆర్ సైతం అల్లు అర్జున్ ఓ బావ అని పిలుస్తాడు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన వైకుంఠపురం లో సినిమా హిట్ అయినప్పుడు మా బావకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ చేసిన సోష‌ల్ మీడియా కామెంట్ల‌కు ఒక్క‌సారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అల‌వైకుంఠ‌పురంలో సినిమాకు ఎంతో స‌పోర్ట్ చేశారు.

 

ఇక రామ్చరణ్‌తో సైతం ఎన్టీఆర్‌కు అనుబంధం ఉందనే చెప్పాలి. ఈ రెండు కుటుంబాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఏదో ఒక పార్టీ చేసుకుంటూనే ఉంటారు. తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ తో ఫ్యామిలీ హీరోలతో సన్నిహితంగా ఉంటూ తాను అందరి వాడిని తనకు వర్గాలు, మతాలు, కులాలు సంబంధం లేదని తామంద‌తా సినిమా కులం అని తన గొప్ప మనసు ఉన్న వైనం మనకు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: