స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం అల... వైకుంఠపురములో..  ఈ సినిమా ఆడియో ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుండి మొదట గా విడుదలైన సామజవరగమన సాంగ్ అయితే యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ ను రాబట్టి గత ఏడాది సాంగ్ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ ఒక్క సాంగ్ తో సినిమాకు  భారీ హైప్ వచ్చింది.

 

ఆతరువాత రాములో రాముల, బుట్ట బొమ్మ కూడా సూపర్ హిట్ కావడంతో సాంగ్స్ కోసమైనా సినిమాను చూడాలనే కోరిక ప్రేక్షకుల్లో కలిగింది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన అల 200కోట్ల పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈసినిమా  మంచి రన్ ను కనబరుస్తుంది.  ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి సామజవరగమన పూర్తి వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 4:05గంటలకు విడుదలచేయనున్నారు.

 
 ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈచిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం , మురళి శర్మ , సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో కనిపించారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. థమన్ ను ఈ సినిమా ఎక్కడో నిలబెట్టింది. కిక్ తరువాత మళ్ళీ ఆరేంజ్ లో ఈసినిమా ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ,సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: