ప్రస్తుతం రాజకీయాలతో పాటుగా సినిమాలతో కూడా బిజీ గా ఉన్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రాజకీయాలకు కూడా సమయం కేటాయిస్తూ ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకి వెళ్తున్నాడు. వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పింక్ తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే ఆయన డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒకేసారి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్. 

 

క్రిష్ తో చేసే సినిమా విషయంలో పవన్ కాస్త సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే క్రిష్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇది తన సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉందని భావించిన పవన్ దీనిని పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తే మంచి ఆదరణ వస్తుందని భావించాడట. అటూ వసూళ్ళ పరంగా కూడా కలిసి వస్తుందని భావించిన పవన్ ఆ విధంగా ముందుకు వెళ్లాలని భావించి ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో వద్దని తర్వాత చూడవచ్చని ముందు తెలుగులో విడుదల చెయ్యాలని చూస్తున్నారట. 

 

దీనితో క్రిష్ కూడా పవన్ అభిప్రాయానికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనికోసం బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే అవుతుందని లెక్కలు కూడా వేసారు. సాహో సైరా సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వెళ్లి బొక్క బోర్లా పడ్డాయి. సాహో పెద్దగా నష్టాలు చూడకపోయినా సైరా సినిమా మాత్రం నష్టాలు చవి చూసింది. దీనితో పవన్ ఆ ప్లాన్ వద్దని, సినిమా కూడా ప్రయోగం కాబట్టి అప్పుడే ఆ విధంగా వెళ్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉండదు అని చెప్పాడట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని టాలివుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: