టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం ఫేమ్ అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక దీని తరువాత పవన్ , క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 

 

పీరియాడికల్ డ్రామాగా ఎంతో భారీ లెవెల్ లో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని ఏఎమ్ రత్నం , తన సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో పవన్ తొలిసారిగా రాబిన్ హుడ్ స్టైల్ లో సాగే ఒక గజ దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ రెండు సినిమాల రిలీజ్ ల విషయమై నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ముందుగా పింక్ రీమేక్ సినిమా మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించే 27వ సినిమా దీపావళికి, లేదా ఒకేసారి వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

 

పింక్ రీమేక్ మాత్రం మే లో వస్తుందని, అయితే క్రిష్ మూవీ మాత్రం షూటింగ్ కు కొంత ఎక్కువ సమయం అవసరం అయ్యేలా కనపడుతోందని, వీలైనంత త్వరగా దాని షూటింగ్ పూర్తి అయితే దీపావళికి, లేదంటే సమ్మర్ కే వస్తుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాని ముందుగా రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారట. అయితే ఇటీల ఆర్ఆర్ఆర్ సినిమాని రాబోయే సంక్రాంతి సమయంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్ పై ఆ ప్రభావం పడినట్టు టాక్. మరి ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఈ రెండు సినిమాల రిలీజ్ ల విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే, ఆయా సినిమాల నిర్మాతల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: